దక్షిణాది రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే ధరలు ఎక్కువ: Ramakrishna

ABN , First Publish Date - 2022-05-30T17:40:29+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోసపూరిత మాటలతో పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

దక్షిణాది రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే ధరలు ఎక్కువ: Ramakrishna

విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోసపూరిత మాటలతో పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...  కనీసం వైఫల్యాలను సరి దిద్దుకునే పరిస్థితిలో కూడా లేరన్నారు. పెట్రోల్, డీజిల్ సెంచరీ దాటినా మోదీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో జగన్ కూడా మోదీతో పోటీ పడి ధరలు పెంచారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో ఉన్న ధరలు మరెక్కడా లేవని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక కన్నా ఏపీలోనే పెట్రోల్ ధర ఎక్కువన్నారు. పన్నులు తగ్గించాలని కోరినా స్పందన లేదని, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్నులు పెంచేశారని అన్నారు. ఎన్ని రూపాలలో ఆందోళన చేసినా ఈ ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అన్ని వామపక్ష పార్టీలు కలిసి ఆందోళన చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికీ మార్పు రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-30T17:40:29+05:30 IST