ముర్ము గిరిజనులకు మేలు చేస్తుందంటే ఎలా నమ్మాలి?: Ramakrishna

ABN , First Publish Date - 2022-06-28T14:48:24+05:30 IST

తన సొంత ఊరికి కరెంటు సౌకర్యం కల్పించలేని ద్రౌపది ముర్ము గిరిజనులకు మేలు చేస్తుందంటే ఎలా నమ్మాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు.

ముర్ము గిరిజనులకు మేలు చేస్తుందంటే ఎలా నమ్మాలి?: Ramakrishna

అమరావతి: తన సొంత ఊరికి కరెంటు సౌకర్యం కల్పించలేని ద్రౌపది ముర్ము (draupadi murmu) గిరిజనులకు మేలు చేస్తుందంటే ఎలా నమ్మాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) ప్రశ్నించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా పనిచేసి కూడా తన సొంత ఊరు అభివృద్ధిని ద్రౌపది ముర్ము విస్మరించారన్నారు. ఇన్నేళ్లు పట్టనట్లుండి ఇప్పుడు మీడియాలో కథనం రావడంతో ఆగమేఘాల మీద ఆ ఊరికి కరెంట్ ఏర్పాటు సిగ్గుచేటని మండిపడ్డారు. ఆమె రాష్ట్రపతి అయితే గిరిజన వర్గాలకు మేలు జరుగుతుందా?... లేక రబ్బరు స్టాంపు రాష్ట్రపతి అవుతుందా? అని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-06-28T14:48:24+05:30 IST