Ramakrishna: పోలవరం నిర్వాసితులకు జగన్ క్షమాపణ చెప్పాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2022-07-25T15:33:41+05:30 IST
పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: పోలవరం(Polavaram) నిర్వాసితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan mohan reddy) క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. గోదావరికి వరదలు పోటెత్తి పోలవరం పరిసర ప్రాంతాలు నీటి మునిగి, నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిర్వాసితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫలితంగా నిర్వాసితులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందిగా కోరుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు పరిహారం ఇచ్చి, పోలవరం పూర్తి చేయడంలో కపట వైఖరి అనుసరించడం శోచనీయమని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇళ్లు నిర్మించి పునర్వాసం కల్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.