CPI Ramakrishna: ఉద్యోగులను పోలీసులు వేధిస్తూనే ఉంటారా?

ABN , First Publish Date - 2022-08-31T16:45:46+05:30 IST

సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన వాయిదా వేసుకున్నప్పటికీ పోలీసులు వేధిస్తూనే ఉంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI Ramakrishna: ఉద్యోగులను పోలీసులు వేధిస్తూనే ఉంటారా?

అమరావతి: సీపీఎస్ (CPS) రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన వాయిదా వేసుకున్నప్పటికీ పోలీసులు వేధిస్తూనే ఉంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులపై పోలీసుల వేధింపులు ఆపాలన్నారు. పోలీసులు తాము కూడా ఉద్యోగులనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. శాంతియుత ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపాలనుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ముళ్లకంచెలు, పోలీసు ఆంక్షలు ఎందుకు? అదేమన్నా నిషేధిత ప్రాంతమా? అని నిలదీశారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు చేపట్టే ఆందోళనకు సీపీఐ (CPI) మద్దతు ఉంటుందని రామకృష్ణ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-31T16:45:46+05:30 IST