విద్యుత్ పంపిణీ సంస్థల నోటీసులను తప్పుబట్టిన Ramakrishna

ABN , First Publish Date - 2021-12-23T14:51:52+05:30 IST

ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇస్తున్న నోటీసులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పుబట్టారు.

విద్యుత్ పంపిణీ సంస్థల నోటీసులను తప్పుబట్టిన Ramakrishna

అమరావతి: ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇస్తున్న నోటీసులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పుబట్టారు. అమ్మఒడి, వృద్ధాప్య, వితంతు పెన్షన్ల వంటి పలు సంక్షేమ పథకాల అమలును కరెంట్ బిల్లుతో ముడిపెట్టడం గమనార్హమన్నారు. జగన్ సర్కార్ ఇప్పటికే ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని మండిపడ్డారు. విద్యుత్తు మీటర్ల తొలగింపుతో ప్రజలపై గుదిబండ మోపేందుకు సిద్ధమైందని రామకృష్ణ అన్నారు. 

Updated Date - 2021-12-23T14:51:52+05:30 IST