యడ్లపాటి మృతిపట్ల సంతాపం తెలిపిన Ramakrishna
ABN , First Publish Date - 2022-02-28T18:08:11+05:30 IST
మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సంతాపం తెలిపారు.
అమరావతి: మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సంతాపం తెలిపారు. సంగం డైరీ వ్యవస్థాపక అధ్యక్షులుగా, రైతు నాయకునిగా, టీడీపీ సీనియర్ నేతగా బాధ్యతలు నిర్వహించిన యడ్లపాటి వెంకట్రావు మరణం బాధాకరమన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా వెంకట్రావు అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. యడ్లపాటి వెంకట్రావు మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామని రామకృష్ణ అన్నారు.