నరేష్, పవిత్ర మాదిరిగా పెళ్లి కాకుండా వైసీపీ, బీజేపీ సహజీవనం: Ramakrishna

ABN , First Publish Date - 2022-07-06T16:46:46+05:30 IST

‘‘వైసీపీ, బీజేపీ బంధం గురించి చెప్పినందుకు వైసీపీ ఎంపీ శ్రీధర్‌ను అభినందిస్తున్న’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

నరేష్, పవిత్ర మాదిరిగా పెళ్లి కాకుండా వైసీపీ, బీజేపీ సహజీవనం: Ramakrishna

అమరావతి: ‘‘వైసీపీ (YCP), బీజేపీ (BJP) బంధం గురించి చెప్పినందుకు వైసీపీ ఎంపీ శ్రీధర్‌(Sridhar)ను అభినందిస్తున్న’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని చెప్పారు ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు(YCP MPs) బీజేపీకి మద్దతిచ్చామని చెప్పారని..  రాష్ట్రానికి హోదా, విభజన హామీలు ఏమిచ్చారో చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తామంటే ఏమీ మాట్లాడలేదని మండిపడ్డారు. నరేష్ (Naresh), పవిత్ర లోకేష్ (Parvitra lokesh) మాదిరిగా పెళ్లి కాకుండా బీజేపీ, వైసీపీ సహజీవనం చేస్తున్నాయని యెద్దేవా చేశారు. గత మూడు సంవత్సరలుగా బీజేపీ, వైసీపీ రంకు రాజకీయం నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. షరతులతో బీజేపీ ప్రభుత్వంలో వైసీపీ చేరతామంటున్నారని ఆయన అన్నారు.


నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నామని చెప్తూ పాఠశాలను మూసివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కే పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంగ్లీష్ మీడియం అని చెప్తూ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తుందని పాఠశాలలు మూసివేస్తున్నారన్నారు. సాక్షి పత్రికను ప్రభుత్వం విలీనం చేసుకోవాలని... అదెలాగూ వైసీపీకి పామ్‌ప్లేట్ అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ప్రకటనలు ఒక్క సాక్షికి, మరికొన్ని పత్రికలకు తప్ప మరో పత్రికలకు ఇవ్వడం లేదని అన్నారు. ‘‘ప్రభుత్వ సొమ్ము ఏమన్నా మీకు రాసిచ్చారా’’ అని ప్రశ్నించారు. దీనిపై ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేసైనా చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపడతామని రామకృష్ణ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-06T16:46:46+05:30 IST