పోలవరంపై సీఎం జగన్కు రామకృష్ణ లేఖ
ABN , First Publish Date - 2020-12-01T13:25:13+05:30 IST
పోలవరం నిర్మాణ పరిస్థితులపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ
అమరావతి: పోలవరం నిర్మాణ పరిస్థితులపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి నిధుల బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు.నిన్న విజయవాడలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందని...అధికార వైసీపీ, బీజేపీ పార్టీలు మినహా అన్ని రాజకీయ పక్షాలు, రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలన్నారు. అపోహలకు తావు లేకుండా పోలవరం సందర్శనకు అఖిలపక్షాన్ని అనుమతించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ చెల్లించి, పునరావాసం కల్పించాలన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.