AP: సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2021-11-13T13:29:44+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.

AP: సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 35, 42, 51 జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం 4 ఆప్షన్లతో మెమో ఇచ్చిందన్నారు. ఈ మెమో వల్ల విద్యార్థులకు, యాజమాన్యాలకు మధ్య వివాదం తలెత్తే పరిస్థితి ఉందని తెలిపారు. ఎడిట్ విద్యాసంస్థల విలీన ప్రక్రియ వల్ల పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నడిపేందుకు, తగిన నిధులు, స్టాఫ్‌ను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-13T13:29:44+05:30 IST