విజయవాడను పోలీసుల వలయంలో ఉంచటం తగునా?: Ramakrishna

ABN , First Publish Date - 2022-04-25T14:49:50+05:30 IST

రాష్ట్ర పోలీసులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు.

విజయవాడను పోలీసుల వలయంలో ఉంచటం తగునా?: Ramakrishna

విజయవాడ: రాష్ట్ర పోలీసులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు. విజయవాడను పోలీసుల వలయంలో ఉంచటం తగునా అని ప్రశ్నించారు. విజయవాడలోని రైల్వే స్టేషన్, బస్టాండ్‌తో సహా పలు ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులను మోహరింప చేశారన్నారు. ముళ్ల కంచెలు వేశారని తెలిపారు. శాంతియుత నిరసనలకు కూడా అనుమతించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీస్ రాజ్యమా? అని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-25T14:49:50+05:30 IST