16,17 తేదీల్లో ఢిల్లీలో పోరాటం: సీపీఐ మూర్తి

ABN , First Publish Date - 2021-12-10T00:44:40+05:30 IST

రైల్వే జోన్ పై రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్ర వైఖరిని

16,17 తేదీల్లో ఢిల్లీలో పోరాటం: సీపీఐ మూర్తి

విశాఖపట్నం: రైల్వే జోన్‌పై రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్ర వైఖరిని నిరసిస్తూఈనెల 16,17 తేదీల్లో ఢిల్లీలో పోరాటం చేయాలని నిర్ణయించామని సీపీఐ సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి  తెలిపారు. దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై ఏపీ ఎంపీలు గట్టిగా పోరాటం చేయాలన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ప్రకటించాలంటూ తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. 


న్యూఢిల్లీ/విశాఖపట్నం : మరో విభజన హామీని కేంద్రం అటకెక్కించింది. విశాఖ కేంద్రంగా తానే ప్రకటించిన కొత్త దక్షిణ కోస్తా (సౌత్‌ కోస్టల్‌) రైల్వే జోన్‌ ఊసే లేకుండా చేసింది. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయని బుధవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే. అందులో విశాఖ జోన్‌ కనిపించ లేదు. పైగా దేశంలో కొత్త రైల్వే జోన్‌ను మంజూరు చేసే అవకాశమే లేదని ఆయన సెలవిచ్చారు.




Updated Date - 2021-12-10T00:44:40+05:30 IST