‘ఆర్కే మరణం తీరని లోటు’

ABN , First Publish Date - 2021-10-18T04:47:26+05:30 IST

జగ్గంపేట, అక్టోబరు 17: సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మరణం పీడిత వర్గానికి తీరనిలోటని ఏపీ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పేర్కొన్నారు. జగ్గంపేటలోని యూటీఎఫ్‌ భవన్‌లో ఆదివారం

‘ఆర్కే మరణం తీరని లోటు’

జగ్గంపేట, అక్టోబరు 17: సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మరణం పీడిత వర్గానికి తీరనిలోటని ఏపీ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పేర్కొన్నారు. జగ్గంపేటలోని యూటీఎఫ్‌ భవన్‌లో ఆదివారం ఆర్కే సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ 2004లో వైఎస్సార్‌ ప్రభుత్వంతో సీపీఐ ఎంఎల్‌ జనశక్తి, పీపుల్స్‌వార్‌ పార్టీలు శాంతి చర్చలు నిర్వహించినప్పుడు ఆర్కే ఉమ్మడి ఆంధ్ర ప్రజలకు సుపరిచితులయ్యారన్నారు. తుదిశ్వాస వరకు ఆర్కే పేద ప్రజల విముక్తి కోసం సాయుధ పోరాట పంధా విడకుండా పోరాడారని చెప్పారు. గణిత ఉపాధ్యాయుడిగా ఉన్న ఆర్కే నిరంత పోరాటయోధుడు అయ్యాడని వివరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు బి.రమేష్‌, ఏఐఎ్‌ఫటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:47:26+05:30 IST