చెంచయ్య ఆశయాల కోసం పోరాడాలి

ABN , First Publish Date - 2021-01-22T05:53:29+05:30 IST

కమ్యూనిస్టు నాయకులు స్వర్గీయ రావులపల్లె చెంచయ్య ఆశయాల కోసం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె నాసరయ్య అన్నారు.

చెంచయ్య ఆశయాల కోసం పోరాడాలి
మాట్లాడుతున్న సీపీఐ నాయకులు


మార్కాపురం (వన్‌టౌన్‌) జనవరి 21: కమ్యూనిస్టు నాయకులు స్వర్గీయ రావులపల్లె చెంచయ్య ఆశయాల కోసం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె నాసరయ్య అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రావులపల్లి చెంచయ్య 14వ వర్ధంతి సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లా మాజీ కార్యదర్శి ఎం.వెంకయ్య, ఎన్జీవో సంఘం మార్కాపురం యూనిట్‌ అధ్యక్షుడు బి.శ్రీనివాసచారి తదితరులు మాట్లాడారు. తొలుత రావులపల్లి చెంచయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు డి.మోహన్‌ రెడ్డి, సీపీఐ నాయకులు పెద్దన్న, ఖాసీం, చెంచయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-01-22T05:53:29+05:30 IST