పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదు

ABN , First Publish Date - 2021-12-02T05:44:49+05:30 IST

కోర్టు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు.

పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదు
సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల, పాల్గొన్న సిపిఐ నాయకులు

ముప్పాళ్ల నాగేశ్వరరావు

గుంటూరు(తూర్పు), డిసెంబరు1: కోర్టు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఆహారం తయారు చేసుకునే సమయంలో స్థానిక ఎమ్మెల్యే గోవర్ధనరెడ్డి ప్రవర్తించిన తీరు నిరంకుశత్వానికి నిదర్శమని మండిపడ్డారు. సమావేశంలో జంగాల అజయ్‌కుమార్‌, వి.రాధాకృష్ణ, కోటా మాల్యాద్రి, కాసా రాంబాబు, వెంకటసుబ్బయ్య, నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T05:44:49+05:30 IST