‘బీజేపీ అభ్యర్థిగా ఎవరున్నా.. తాము వ్యతిరేకిస్తాం’

ABN , First Publish Date - 2022-06-27T23:59:28+05:30 IST

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి మోదీనే కారణమని సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సంకుచిత రాజకీయ ప్రభావం మహారాష్ట్రపై పడిందన్నారు.

‘బీజేపీ అభ్యర్థిగా ఎవరున్నా.. తాము వ్యతిరేకిస్తాం’

ఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి మోదీనే కారణమని సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సంకుచిత రాజకీయ ప్రభావం మహారాష్ట్రపై పడిందన్నారు. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసిందన్నారు. వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతుందని ఆయన మండిపడ్డారు. ఈడీ గొర్రెల మంద.. మోదీ ఏం చెప్తే అది చేస్తారని విమర్శించారు. టీఆర్ఎస్ యశ్వంత్‌సిన్హాకు మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. దేశ అధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థిగా ఎవరున్నా.. తాము వ్యతిరేకిస్తామన్నారు. 

Updated Date - 2022-06-27T23:59:28+05:30 IST