రాష్ట్రపతి విరాళం లౌకిక విధానానికి వ్యతిరేకం

ABN , First Publish Date - 2021-01-17T09:54:13+05:30 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం రామ్‌జన్మభూమి తీర్ధ్‌ ట్రస్ట్‌కు రూ.5,00,100

రాష్ట్రపతి విరాళం లౌకిక విధానానికి వ్యతిరేకం

 సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ 


 హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం రామ్‌జన్మభూమి తీర్ధ్‌ ట్రస్ట్‌కు రూ.5,00,100 విరాళంగా అందించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తప్పుబట్టారు. రాష్ట్రపతి దేశ రాజ్యాంగ అధిపతి అని, ఆయన వ్యక్తిగత ఖాతా నుంచి సైతం విరాళం అందించడం దురదృష్టకరమన్నారు. ఆయన బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకుడు కాదని, రామమందిర నిర్మాణం కోసం విరాళం అందించడం దేశ లౌకిక విధానానికి వ్యతిరేకమన్నారు. 

Updated Date - 2021-01-17T09:54:13+05:30 IST