12 గంటల పని విధానం రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-06-30T07:13:16+05:30 IST

కొత్తగా తెచ్చిన 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలంటూ ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు బుధవారం రేవతీ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.

12 గంటల పని విధానం రద్దు చేయాలి

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 29 : కొత్తగా తెచ్చిన 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలంటూ ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు బుధవారం రేవతీ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. సీపీఐ నేత మోదుమూడి రామారావు మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా యాజమాన్యాలకు ప్రభు త్వం అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికుల పనిగంటలు పెంచుతూ కార్మిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. సీపీఐ నాయకులు యర్రంశెట్టి ఈశ్వరరావు, దేవభక్తుని నిర్మల, ఏఐటీయూసీ నాయకులు కె. సత్యనారాయణ, చైతన్య, వై.నారాయణ, వి.నరేంద్ర, డి..దుర్గాప్రసన్న, నాగరాజు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T07:13:16+05:30 IST