‘జనం నీరాజనాలు పడుతుంటే పాలకులకు కన్ను కుడుతుంది’

ABN , First Publish Date - 2021-12-01T23:16:38+05:30 IST

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో అమరావతి రైతుల మహా పాదయాత్ర అడ్డుకోవటం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శాంతియుతంగా కొనసాగుతున్న పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం వసతి, భోజన ఏర్పాట్లను నిలువరించడం...

‘జనం నీరాజనాలు పడుతుంటే పాలకులకు కన్ను కుడుతుంది’

అమరావతి: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో అమరావతి రైతుల మహా పాదయాత్ర అడ్డుకోవటం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శాంతియుతంగా కొనసాగుతున్న పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం వసతి, భోజన ఏర్పాట్లను నిలువరించడం దుర్మార్గమన్నారు. అమరావతి మహా పాదయాత్రకు జనం నీరాజనాలు పడుతుంటే పాలకులకు కన్ను కుడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర నిరాటంకంగా కొనసాగేందుకు తోడ్పడాలని సూచించారు.

Updated Date - 2021-12-01T23:16:38+05:30 IST