జగన్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు: సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2022-01-05T00:01:17+05:30 IST

సీఎం జగన్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ

జగన్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు:  సీపీఐ రామకృష్ణ

రాజమండ్రి: సీఎం జగన్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. జగన్, ఢిల్లీ పర్యటనపై ఆయన మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో జగన్ కొత్తగా అడిగిందేమీ లేదన్నారు. విశాఖ ఉక్కు కోసం ఏమీ అడగలేదన్నారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రాన్ని కూడా  బయటపెట్టడం లేదన్నారు.  మోదీ ఎమాన్నారో  సీఎం బయటకు చెప్పటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 20 వేల కోట్లు కోతను  విధిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 55,650 కోట్లు  ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరుతున్నారన్నారు. మరి పోలవరం నిధులపై ప్రధాని స్పందించారో లేదా సీఎం  చెప్పటం లేదని ఆయన విమర్శించారు. ఢిల్లీలోనే ఉండి అమిత్ షాను కలిసేందుకు జగన్ పడిగాపులు కాస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏలా ఉందో సీఎం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి రావల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రి కేంద్రంపై పోరాటం చేస్తారో లేక లాలూచి పడతారో  చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటనపై వాస్తవాలను  జగన్ ప్రజలకు చెప్పాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-01-05T00:01:17+05:30 IST