సీఎం జగన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-23T01:58:39+05:30 IST

ప్రకాశం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనిగిరిలో నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్లీనరీలో జగన్ భజన తప్ప ఇంకేమీ

సీఎం జగన్‌పై  సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

ప్రకాశం:  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనిగిరిలో నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్లీనరీలో జగన్ భజన తప్ప ఇంకేమీ లేదన్నారు. ప్రతిపక్షాలను తిట్టడానికే జగన్‌ ప్లీనరీ (Plenary) పెట్టినట్టుందని వ్యాఖ్యానించారు.  ప్రజాసమస్యలపై ప్లీనరీలో చర్చించారా? తీర్మానాలు చేశారా? అని ప్రశ్నించారు. జగన్‌ భజన చేయడానికి 151 మంది ఎమ్మెల్యేలు సరిపోరా.. 175 మంది ఎమ్మెల్యేలు కావాలా? అని వ్యంగ్యంగా మాట్లాడారు. 

Updated Date - 2022-07-23T01:58:39+05:30 IST