చంద్రబాబుతో రోడ్ షోలో పాల్గొన్న సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2021-03-07T23:47:03+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుతో రోడ్ షోలో సీపీఐ నేత రామకృష్ణ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

చంద్రబాబుతో రోడ్ షోలో పాల్గొన్న సీపీఐ రామకృష్ణ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో రోడ్ షోలో సీపీఐ నేత రామకృష్ణ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు జగన్‌కు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధానిగా ఉంటే సొంతూరులోనే ఉద్యోగం చేసుకునేవాళ్లని, ఇప్పుడు పాచిపనికి కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. సీఎం ఆడే మూడుముక్కలాటకు నగరపాలక ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అమరావతిలో రూ. 6లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారని, 6 పైసల అవినీతి కూడా రుజువు చేయలేకపోయారని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2021-03-07T23:47:03+05:30 IST