అధ్వాన రోడ్లను బాగుచేయాలి
ABN , First Publish Date - 2021-10-27T05:12:51+05:30 IST
ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైన రోడ్లను తక్షణమే బాగుచేయాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు డిమాండ్ చేశారు.
బుట్టాయగూడెం, అక్టోబరు 26: ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైన రోడ్లను తక్షణమే బాగుచేయాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు డిమాండ్ చేశారు. గిరిజనులు దండిపూడి నుంచి నందాపు రం వరకు మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. నాయకులు కారం రాఘవ, టి.బాబురావు మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రధాన రహదారులన్నీ భారీ వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రోడ్లను బాగుచేయాలన్నారు. కొండ వాగులపై కల్వర్టులను, వంతెనలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అసం పూర్తిగా మిగిలిపోయిన వంతెనలను పూర్తిచేయాలని కోరారు. బి.వినోద్, దూల చంద్రమౌళి, బొందల శ్రీను, కలుం రాముడు, మామిడి మురళి, మ ల్లం పెంటయ్య, బుల్లాబ్బాయ్, దుర్గమ్మ, పోశమ్మ తదితరులు పాల్గొన్నారు.