చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు: మధు

ABN , First Publish Date - 2020-09-26T18:39:11+05:30 IST

చంద్రబాబు సిగ్గు విడిచి మత రాజకీయాలు చేస్తున్నారని సీపీఎం మధు విమర్శించారు. ‘మోదీ.. కార్పొరేట్‌ రంగానికి దేశ సంపదను

చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు: మధు

విజయవాడ: చంద్రబాబు సిగ్గు విడిచి మత రాజకీయాలు చేస్తున్నారని సీపీఎం మధు విమర్శించారు. ‘మోదీ.. కార్పొరేట్‌ రంగానికి దేశ సంపదను దోచిపెడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా 29, 30, 1 తేదీల్లో నిరసన దీక్షలు’ చేపడుతున్నట్లు మధు తెలిపారు.


జగన్‌ వంగి వంగి దండాలు పెడుతున్నారు..

కేంద్రంలోని పెద్దలకు సీఎం జగన్‌ వంగి వంగి దండాలు పెడుతున్నారని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. ‘రూ.4 వేల కోట్ల అప్పు కోసం విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారు . విద్యుత్ మీటర్లు బిగించిన రోజు నుంచే జగన్‌ రాజకీయ పతనం మొదలవుతుంది. టీడీపీ ఎంపీలు ఇక్కడ ఒకలా, పార్లమెంట్‌లో మరోలా మాట్లాడుతున్నారు. బీజేపీ ఇల్లు తగులబెట్టి బొగ్గులు ఎరుకునే ప్రయత్నం చేస్తోంది’ అని రామకృష్ణ ఆరోపించారు.

Updated Date - 2020-09-26T18:39:11+05:30 IST