వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ సీపీఎం, సిటూ నిరసన
ABN , First Publish Date - 2020-12-04T04:25:38+05:30 IST
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ సీపీఎం గాజువాక శాఖ గురువారం వందడుగుల రోడ్డులో రాస్తారోకో నిర్వహించింది.
గాజువాక, డిసెంబరు 3: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ సీపీఎం గాజువాక శాఖ గురువారం వందడుగుల రోడ్డులో రాస్తారోకో నిర్వహించింది. గాజువా క జోన్ కమిటీ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగంపై ఉక్కు పాదం మోపుతున్నదన్నారు. కార్యక్రమంలో కె.కిరీటం, కె.అప్పలరాజు, ఎ.లోకేష్, కేపీ కుమార్, స్వర్ణలత, ఎం.శ్రీదేవి పాల్గొన్నారు.
పెదగంట్యాడలో
వ్యవసాయ చట్టాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో పెదగంట్యాడ జంక్షన్లో నిరసన చేపట్టారు. సిటూ ప్రధాన కార్యదర్శి కొవిరి అప్పలరాజు, శ్రీను, రమణ, రాముడు, తదితరులు పాల్గొన్నారు.