ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-03-02T05:48:23+05:30 IST

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్‌ వై.శ్రీనివాసరావు, డీఎంసీ నాగరాజులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను సీపీఎం కోరింది.

ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోండి

యూసీడీ పీడీ, డీఎంసీలపై ఎన్నికల కమిషనర్‌కు సీపీఎం ఫిర్యాదు

డాబాగార్డెన్స్‌, మార్చి 1: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్‌ వై.శ్రీనివాసరావు, డీఎంసీ నాగరాజులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను సీపీఎం కోరింది.  పార్టీ జిల్లా కార్యదర్శి కె.లోకనాథం సోమవారం నిమ్మగడ్డను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు.


పీడీ, డీఎంసీలు మెప్మా ఆర్‌పీలు, వార్డు వలంటీర్లపై ఒత్తిడి తెచ్చి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని, వాళ్ల పరిధిలోని డ్వాక్రా గూపు లీడర్లతో సమావేశాలు నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారని  ఫిర్యాదులో ఆరోపించారు. వార్డుకు ఐదురుగు చొప్పున మెప్మా ఆర్‌పీలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వద్దకు తీసుకెళ్లారన్నారు. అందువల్ల ఎన్నికలు పూర్తయ్యే వరకు వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, వలంటీర్లు వార్డుల్లో తిరగకుండా కట్టడి చేయాలని కోరారు.  

Updated Date - 2021-03-02T05:48:23+05:30 IST