భద్రాచలంలోకి పోలవరం బ్యాక్ వాటర్ వస్తే ఊరుకోం: మధు

ABN , First Publish Date - 2021-07-03T17:04:07+05:30 IST

పోలవరం నిర్మాణంతో గోదావరిలో ప్రజలను ముంచేస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు.

భద్రాచలంలోకి పోలవరం బ్యాక్ వాటర్ వస్తే ఊరుకోం: మధు

భద్రాద్రి: పోలవరం నిర్మాణంతో గోదావరిలో ప్రజలను ముంచేస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. శనివారం భద్రాచలంలో అఖిలపక్ష నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ముంపు మండలాల్లో పరిహారం చెల్లించడంలో, పునరావాసం కల్పనలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా జులై 5న విజయవాడలో దీక్ష చేయనున్నట్లు తెలిపారు. 3 లక్షల మంది భూ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలోకి పోలవరం బ్యాక్ వాటర్ వస్తే ఊరుకోమని మధు అన్నారు.

Updated Date - 2021-07-03T17:04:07+05:30 IST