వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు పెరిగాయి: Madhu
ABN , First Publish Date - 2022-06-06T16:18:06+05:30 IST
వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు పెరిగాయని సీపీఎం నేత మధు అన్నారు.
విశాఖపట్నం: వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు పెరిగాయని సీపీఎం నేత మధు(Madhu) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ, బీజేపీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జులై 11న కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కష్టాలకు కారణమైన బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) జత కట్టడం దారుణమని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికల పేరుతో జగన్ ప్రజా సమస్యలను తీర్చడం మానేసి ప్రజల దృష్టిని దారి మళ్ళిస్తున్నారన్నారు. కాంట్రాక్టు ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వైసీపీ పాలనలో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు విశాఖలో భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. భూఅక్రమణలపై ఆందోళన నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్లు చేయడం దుర్మాగమైన చర్య అని మధు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.