ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలి

ABN , First Publish Date - 2020-11-29T05:52:20+05:30 IST

మండలంలోని కుంచనపల్లి గ్రామ పరిధిలోని ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ కాలవకట్టపై ఉన్న పేదలకు ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వకుండా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరికాదని సీపీఎం రూరల్‌ కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలి
సమావేశంలో పాల్గొన్న స్థానికులు

తాడేపల్లి, నవంబరు 28: మండలంలోని కుంచనపల్లి గ్రామ పరిధిలోని ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ కాలవకట్టపై ఉన్న పేదలకు ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వకుండా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరికాదని సీపీఎం రూరల్‌ కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి, బాధితులకు హౌసింగ్‌ స్కీమ్‌ ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కాజ వెంకటేశ్వరరావు, అమ్మిశెట్టి రంగారావు, గొట్టిపాటి వెంకటేశ్వరరావు, తాడిశెట్టి శ్రీనివాసరావు, భూషణం తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-11-29T05:52:20+05:30 IST