పన్నుల భారంపై సీపీఎం నిరసన ర్యాలీ

ABN , First Publish Date - 2022-01-23T05:16:08+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని సీపీఎం నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ధ్వజమెత్తారు.

పన్నుల భారంపై సీపీఎం నిరసన ర్యాలీ
ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

మల్కాపురం, జనవరి 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని సీపీఎం నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ధ్వజమెత్తారు. చెత్తపన్ను విధింపు, ఆస్తి పన్ను పెంపునకు నిరసనగా 62వ వార్డు త్రినాథపురంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం రూ.120 చెత్త పన్ను విధించిందన్నారు. అలాగే ఆస్తిపన్ను పెంచిందన్నారు. వీటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూడి పైడిరాజు, పిసిని రామారావు, ఎల్‌.కృష్ణ, టి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T05:16:08+05:30 IST