రేపటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు
ABN , First Publish Date - 2022-01-21T05:50:21+05:30 IST
సీపీఎం రాష్ట్ర 3వ మహాసభలు జనవరి 22నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు ప్రకటించారు.
పాలమూరు, జనవరి 20 : సీపీఎం రాష్ట్ర 3వ మహాసభలు జనవరి 22నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు ప్రకటించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 22న సాయంత్రం బహిరంగసభను ఆన్లైన్లో నిర్వహిస్తున్న ట్లు పేర్కొ న్నారు. మహాసభల్లో అఖిలభారత కార్యదర్శి సీతారం ఏచూరితోపాటు బృందాకారత్, బి.వి రాఘవులు, తమ్మినేని వీరభద్రం, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సీతారాములు ప్రసంగి స్తారని వివరించారు. 23, 24, 25వ తేదీల్లో ప్రతినిధుల సభలో నాలుగేళ్లలో సీపీఎం కార్మిక, కర్షక రైతు, వ్యవసాయ కార్మిక సమస్యలపై నిర్వహించిన పోరాటాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చర్చించి ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఆన్లైన్ బహి రంగ సభకు పల్లె, పట్టణం, వీధుల్లో ప్రజలు చూసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహిం చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు కిల్లె గోపాల్, ఎన్.కురుమూర్తి, బి.చంద్రకాంత్ పాల్గొన్నారు.