సీపీఎస్ రద్దు కోసం ఎమ్మెల్యేకి వినతి
ABN , First Publish Date - 2022-05-17T02:43:03+05:30 IST
సీపీఎస్ను రద్దుచేసి ఓపీఎస్ను అమలుచేయాలని కోరుతూ బహుజన టీచర్స్ అసోసి యేషన్ (బీటీఏ) ఆధ్వర్యంలో సో
కందుకూరు, మే 16: సీపీఎస్ను రద్దుచేసి ఓపీఎస్ను అమలుచేయాలని కోరుతూ బహుజన టీచర్స్ అసోసి యేషన్ (బీటీఏ) ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులు ఎమ్మెల్యే యం. మహీధరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీటీఏ ఆధ్వర్యంలో 175 మంది ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సీపీఎస్ను రద్దుచేసి ఓపిఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టా రమేష్, నాయకులు సంగా మహేంద్ర, షేక్ అబ్దుల్లా, యలమంద, పి. వెంకటరావు, కె. శ్యామ్, కె. అంజయ్య తదితరులు పాల్గొన్నారు.