క్రికెట్‌ విజేత పీసీపల్లి

ABN , First Publish Date - 2021-01-22T05:54:34+05:30 IST

సంక్రాంతి సందర్భంగా పీసీపల్లి యూత్‌ ఆధ్వర్యంలో పీసీపల్లిలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో విజేత పీసీపల్లి సీనియర్‌ జట్టు గెలిచింది.

క్రికెట్‌ విజేత పీసీపల్లి



పీసీపల్లి, జనవరి 21 : సంక్రాంతి సందర్భంగా పీసీపల్లి యూత్‌ ఆధ్వర్యంలో పీసీపల్లిలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో విజేత పీసీపల్లి సీనియర్‌ జట్టు గెలిచింది. మొత్తం 40 టీములు పాల్గొనగా ఫైనల్‌లో పీసీపల్లి, విజయనగర్‌ కాలనీ జట్టులు పోటీ పడ్డాయి. ఈ పోటీలో పీసీపల్లి జట్టు విజయం సాఽధించి ప్రధమ స్థానంలో నిలవగా, రన్నర్స్‌గా విజయనగర్‌ కాలనీ జట్టు నిలిచింది. విజయం సాధించిన పీసీపల్లి జట్టుకు మొదటి బహుమతిగా ఓకె రెడ్డి రూ.10116, రన్నర్‌గా నిలిచిన విజయనగర్‌ కాలనీ జట్టుకు వెంకటరెడ్డి, క్రిష్ణ రూ.5116, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సాధించిన క్రీడాకారులకు పీసీపల్లి డీలర్‌ గుంటగాని భాస్కర్‌ రూ.2116 నగదును బహుమతిగా అందజేశారు. ఈ బహుమతులను పీసీ పల్లి ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో బొర్రారెడ్డి, ఓకెరెడ్డి, క్రిష్ణ, వెంకటరెడ్డి, భాస్కర్‌, క్రీడాకారులు ఉన్నారు.  

Updated Date - 2021-01-22T05:54:34+05:30 IST