క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-07T22:59:57+05:30 IST

నగరంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్: నగరంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు అందిన సమాచారంతో ఐపీఎల్ -2022 క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారన్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని 5 చోట్ల క్రికెట్ బెట్టింగ్‌ను ఈ ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1 కోటి 62 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. 42 లక్షల 38 వేల నగదు, 05 కమ్యూనికేషన్ బోర్డ్స్, 07 ల్యాప్ టాప్స్, 46 స్మార్ట్ మొబైల్స్, 32 మొబైల్ ఫోన్లు, 01 ట్యాబ్, 03 టీవీలు, 03 కార్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-07T22:59:57+05:30 IST