హోరాహోరీగా క్రికెట్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-06-25T04:40:29+05:30 IST

మండలంలోని పిడూరు గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు మూడు రోజులుగా హరాహోరీగా జరుగుతున్నాయి.

హోరాహోరీగా క్రికెట్‌ పోటీలు
పిడూరులో క్రికెట్‌ ఆడుతున్న క్రీడాకారులు

 మనుబోలు, జూన్‌ 24: మండలంలోని పిడూరు గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు మూడు రోజులుగా హరాహోరీగా జరుగుతున్నాయి. శుక్ర వారం ఉదయం పిడూరు, యాచవరం జట్లు ఆడాల్సి ఉంది. యాచవరం జట్టు రాకపోవడంతో పిడూరు జట్టుకు బై ఇచ్చారు. మధ్యాహ్నం మనుబోలు మెయిన్‌ జట్టు, కొండూరు కింగ్స్‌ జట్టుతో పోటీకి దిగింది. నిర్ణీత పది ఓవర్లలో మనుబోలు మెయిన్‌జట్టు 94 పరుగులు చేయగా, కొండూరు కింగ్స్‌ జట్టు 71 పరుగులు చేసి ఓడిపోయింది. వేణు, వినయ్‌, వెంకటేష్‌ ఆర్గనైజర్లుగా వ్యవహరించారు.

Updated Date - 2022-06-25T04:40:29+05:30 IST