కికెట్ జిల్లా జట్టు ఎంపిక
ABN , First Publish Date - 2022-05-29T06:31:32+05:30 IST
కికెట్ జిల్లా జట్టు ఎంపిక
ఏలూరు స్పోర్ట్స్, మే 28: పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏలూరు ఆశ్రం కళాశాల మైదానంలో అండర్–16 బాలుర క్రికెట్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. నాగవర్మ కోచ్గా వ్యవహరిస్తారని, జూన్ 10 నుంచి 20వరకు నర్సరావుపేటలోని పేరిచర్లలో ఏసీఏ ఇంటర్ డిస్ర్టిక్ట్ పోటీల్లో జిల్లా తరఫున జట్టు ప్రాతినిథ్యం వహిస్తుందని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.ఆదిత్యవర్మ, శ్రీనివాసరాజు పేర్కొన్నారు.
ఎంపికైంది వీరే..
వీఎంవీఎస్ రక్షణన్–ఏలూరు, సీహెచ్ వినయ్–ఏలూరు, పి.దీక్షిత్బాబు–భీమవరం, ఆర్.చంద్ర అనిష్క్–భీమడోలు, పి.ఇనాస్తేజ–నర్సాపురం, షేక్ముజమ్మి–ఏలూరు, కె.ప్ర ణీత్ పవన్–కాట్లంపూడి, ఎన్.రేవంత్కుమార్–భీమవరం, ఎస్.లిఖిత్రాజ్ –భీమవరం, పీఎస్ఎస్సూర్యరాఘవ–తణుకు, కె.యశ్వంత్సాయి–చెరుకువాడ, ఎం.ప్రసంగ చౌదరి –ఏలూరు, బి.కల్యాణ్ దుర్గాప్రసాద్–జంగారెడ్డిగూడెం, ఎ.దినేష్ శివకార్తీక్–ఏలూరు, పీవీవీ కృష్ణ–ఏలూరు, స్టాండ్ బైకా ఎం.వరుణ్కుమార్–ఏలూరు, వై.చేతన్–భీమడోలు, మణిశంకర్–ఏలూరు, ఆర్.దేవ్ ఆశీస్–భీమవరం, కార్తీక్–తణుకు.