క్రికెట్ టోర్నీ ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-17T05:24:24+05:30 IST
క్రీడలు భవిష్యత్కు ఎంతో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు.
కాల్వశ్రీరాంపూర్, జనవరి 16: క్రీడలు భవిష్యత్కు ఎంతో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ కప్ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న సందర్భంగా 32 జట్ల క్రీడాకారులకు ఆయన క్రికెట్ కిట్లు, టీషర్టులు అందజేశారు. అనంతరం ఆయన టోర్నమెంట్ను ప్రారంభించారు. ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీదేవిరాజు, వైస్ ఎంపీపీ శిరీషఅనీల్, ఎంపీటీసీ సువర్ణరామచంద్రం తదితరులు పాల్గొన్నారు.