వైసీపీ ప్లీనరీలో ఆకలి కేకలు
ABN , First Publish Date - 2022-07-01T05:19:02+05:30 IST
పట్టణ శివారులోని టీటీడీ కల్యాణ మండప ఆవరణలో గురువారం వైసీపీ జిల్లాస్థాయి ప్లీనరీ నిర్వహించారు.
తట్టుకోలేక గేటు దూకి వెళ్లిన కార్యకర్తలు
పార్వతీపురంటౌన్, జూన్ 30: పట్టణ శివారులోని టీటీడీ కల్యాణ మండప ఆవరణలో గురువారం వైసీపీ జిల్లాస్థాయి ప్లీనరీ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం 12కి మొదలైంది. మఽఽధ్యాహ్నం 2 గంటలు అవుతున్నా పూర్తి కాలేదు. అప్పటికే భారీ వర్షం కురిసింది. ఆకలితో ఉన్న కార్యకర్తలు భోజనాలు పెడుతున్న టీటీడీకల్యాణ మండపంలోకి వెళ్లేందుకు గేటు దూకాల్సి వచ్చింది. గంటసేపు భారీ వర్షం కురవడంతో నాయకులతోపాటు కార్యకర్తలు కల్యాణ మండపంలోకి పరుగులు తీశారు.