దాచుకున్న సొమ్ము అడిగితే బెదిరించాడు

ABN , First Publish Date - 2021-05-07T05:47:56+05:30 IST

దాచుకున్న డబ్బు ఇవ్వమని అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించిన వ్యక్తిపై కేసునమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు.

దాచుకున్న సొమ్ము అడిగితే బెదిరించాడు

కొవ్వూరు, మే 6 : దాచుకున్న డబ్బు ఇవ్వమని అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించిన వ్యక్తిపై కేసునమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు. పశివేదల గ్రామానికి చెందిన బొబ్బిలి లక్ష్మి, రామానాయుడు దంపతులు అదేగ్రామానికి చెందిన బాలాజి శ్రీనుకు చెందిన కోళ్ళ ఫారంలో పనిచేస్తున్నారు. స్థలం కొనుకుందామని తమ వేతనంలో కొంచెం యజమాని వద్ద దాచుకుంటున్నారు. అలా ఉంచిన సొమ్ము రూ.1.75 లక్షలు అడిగితే వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇటీవల మళ్లీ అడిగితే డబ్బులేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించడంతో బాధితురాలు బొబ్బిలి లక్ష్మి కొవ్వూరు రూరల్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-05-07T05:47:56+05:30 IST