బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-05-08T05:44:29+05:30 IST

ఎనిమిదో తరగతి చదివిన 14 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన గుంటూరులో వెలుగుచూసింది.

బాలికపై అత్యాచారం

ముగ్గురు నిందితులపై కేసు నమోదు



గుంటూరు, మే 7: ఎనిమిదో తరగతి చదివిన 14 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన గుంటూరులో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి రోడ్డు ప్రాంతానికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన సువర్ణరాజు, మహేష్‌, శ్రీను అనే ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడాది క్రితం తొలుత సువర్ణరాజు బాలికతో పరిచయం పెంచుకుని అతను ఆమె ఇంటికి బలవంతంగా అనుభవించాడు. ఆ తర్వాత సువర్ణరాజు స్నేహితులు మహేష్‌, శ్రీను ఆమెపై అత్యాచారం చేశారు. బాలికను ఫోనులో పరిచయం చేసుకుని ఆమెకు మాయమాటలు చెబుతూ ఒకరికి తెలియకుండా ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు.  విషయం బాలిక ఇంట్లో చెప్పటంతో కుటుంబ సభ్యులు అరండల్‌పేట స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-08T05:44:29+05:30 IST