చనిపోతున్నా.. అమ్మకు చెప్పు..
ABN , First Publish Date - 2020-11-30T04:38:51+05:30 IST
కుడికాలువలో దూకి వ్యక్తి వ్యక్తి గల్లంతైన ఘటన ఆదివారం విజయపురిసౌత్లో చోటుచేసుకుంది.
కుమారుడితో చెప్పి కాలువలో దూకి వ్యక్తి గల్లంతు
విజయపురిసౌత్, నవంబరు 29: కుడికాలువలో దూకి వ్యక్తి వ్యక్తి గల్లంతైన ఘటన ఆదివారం విజయపురిసౌత్లో చోటుచేసుకుంది. స్థానిక దేశవరం క్యాంపు తండాకు చెందిన బాణావత్ బాలునాయక్(32) గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. ఆదివారం ఉదయం బాలునాయక్ తన కుమారుడైన సైదులును వెంటపెట్టుకొని కుడికాలువ సమీపానికి చేరుకున్నాడు. అనంతరం నేను చనిపోతున్నాను.. మీ అమ్మకు చెప్పు అంటూ తన కుమారుడితో చెప్పి కాలువలోకి దూకాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పాల్ రవీందర్ సిబ్బందితో వెళ్లి కాలువ వెంట గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలునాయక్కి భార్య ఆదిలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.