రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

ABN , First Publish Date - 2020-12-04T03:46:14+05:30 IST

రోడ్డు ప్రమాదంలో కా నిస్టేబుల్‌ మృతి చెందిన సంఘ టన జాతీయ రహదారి 44పై గల జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఉత్తర ఫుడ్స్‌ దగ్గర బుధవారం రాత్రి చోటు చే సుకున్నది.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి
రాజశేఖర్‌ (ఫైల్‌)

అలంపూర్‌ చౌరస్తా, డిసెం బరు 3 : రోడ్డు ప్రమాదంలో కా నిస్టేబుల్‌ మృతి చెందిన సంఘ టన జాతీయ రహదారి 44పై గల జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఉత్తర ఫుడ్స్‌ దగ్గర బుధవారం రాత్రి చోటు చే సుకున్నది.  ఎస్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి. మండలంలోని బైరాపు రం గ్రామానికి చెందిన రాజశేఖర్‌ ఉండవల్లి పోలీస్‌ స్టేషన్‌లో రెం డేళ్లుగా కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. పిల్లల చదువు కోసం కర్నూల్‌లో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఉండ వల్లిలో విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై కర్నూల్‌కు బయల్దేరాడు. ఈ సమయంలో బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వి షయం తెలుసుకున్న పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, స్థానికులు వెం టనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గురువారం సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య జానకమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కర్నూలు ఆసుపత్రిలో ఎమ్మెల్యే అబ్రహాం బాధిత కుటుంబాన్ని ప రామర్శించగా, అంత్యక్రియలకు జిల్లా ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ హాజరయ్యారు. మృ తుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-04T03:46:14+05:30 IST