ప్రభుత్వ రుణం పేరుతో గాలం

ABN , First Publish Date - 2021-03-06T07:18:50+05:30 IST

ప్రభుత్వ పథకాలు, రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ. 16 లక్షలు కాజేశారు.

ప్రభుత్వ రుణం పేరుతో గాలం

 మహిళ నుంచి రూ. 16 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హిమాయత్‌నగర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు, రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ. 16 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన మహిళ ఫోన్‌ నెంబర్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. నమ్మిన ఆమె అతడు చెప్పిన ఖాతాలో నగదు జమ చేసింది. జీఎ్‌సటీ, ట్యాక్స్‌ల పేరుతో ఎనిమిది సార్లు ఆమె నుంచి రూ. 16 లక్షలు వివిధ ఖాతాల్లో జమచేయించుకున్నాడు. అనంతరం ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-03-06T07:18:50+05:30 IST