అన్ననే హంతకుడు

ABN , First Publish Date - 2021-03-07T05:54:42+05:30 IST

మూసాపేట మండలం జానంపేట గ్రామానికి చెందిన సంతోష్‌(7) హత్య కేసు మిస్టరీ వీడింది.

అన్ననే హంతకుడు

భూత్పూర్‌/ముసాపేట, మార్చి 6 : మూసాపేట మండలం జానంపేట గ్రామానికి చెందిన సంతోష్‌(7) హత్య కేసు మిస్టరీ వీడింది. సొంతం అన్ననే హంతకుడని తే లింది. ఎస్‌ఐ పర్వతాలు శనివారం వెల్లడించిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన విష్ణు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మనస్పర్థలు రావడంతో పెద్ద భార్య పద్మను 13 ఏళ్ల క్రితం వదిలి పెట్టాడు. అప్పటికే ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. విష్ణు తిరిగి లక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు సంతోష్‌ అనే కుమారుడు ఉన్నాడు. పెద్ద భార్య తన తల్లి గారి గ్రామం మహ్మద్‌హుస్సేన్‌పల్లి లో ఉంటోంది. ఈమె కుమారుడు(16) విష్ణు వద్దనే ఉంటున్నాడు. అన్నదమ్ములైన సంతోష్‌, పెద్దభార్య కుమారుడు తరచూ గొవడ పడుతుండే వారు. ఫిబ్రవరి 22న త మ్ముడితో అన్న గొడవపడ్డాడు. ఈ క్రమంలో తమ్ముడిని చంపాలని నిర్ణయించుకున్నా డు. అదే రోజు వ్యవసాయ బావికి సంతోష్‌ను తీసుకెళ్లి, తాడుతో గొంతుకు ఉరి వేసి చంపేశాడు. అనంతరం చీరలో చుట్టి పక్కనే ఉన్న బావిలో పడేశాడు. అప్పటి నుంచి బాలుడి హత్యపై శోధించిన పోలీసులకు ఆశ్చర్యాన్ని కల్గించే విషయం బయట పడిం ది. కుటుంబ సభ్యులపై అనుమానంతో పోలీసులు ఆరా తీయగా, సంతోష్‌ను హత్య చేసి బావిలో పడేసింది సొంత అన్ననే అని తేలింది. బాలుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-03-07T05:54:42+05:30 IST