వైన్‌షాపులో చోరీ

ABN , First Publish Date - 2021-01-22T03:57:48+05:30 IST

మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని ఓ వైన్‌షాపులో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది.

వైన్‌షాపులో చోరీ

    వడ్డేపల్లి, జనవరి 21: మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని ఓ వైన్‌షాపులో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం తాళాలు పగులగొట్టి రూ.10వేలు, నాలుగు మద్యం సీసాలను దొంగిలించారు. ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


బంగారం అపహరణ

    ఇటిక్యాల/ ఎర్రవల్లి చౌరస్తా, జనవరి21: మండలంలోని గార్లపాడ్‌ గ్రామంలో బుధవారం రాత్రి జమ్మన్న అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాలు.. జమ్మన్న బుధవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి గొర్రెల మంద వద్దకు వెళ్లాడు. రాత్రి పది గంటల సమయంలో ఆయన తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలోని రెండున్నర తులాల బంగారం, రూ.8వేలు చోరీకి గురైనట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-22T03:57:48+05:30 IST