Crime News: నెల్లూరు నగరంలో దారుణం
ABN , First Publish Date - 2022-08-28T16:20:24+05:30 IST
నెల్లూరు (Neloore): నగరంలో దారుణం జరిగింది. మినీ బైపాస్ రోడ్డు ఏఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద...
నెల్లూరు (Neloore): నగరంలో దారుణం జరిగింది. మినీ బైపాస్ రోడ్డు ఏఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద భార్యాభర్తలను దుండగులు దారుణంగా హత్య (Murder) చేశారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరపడ్డ దుండగులు. భార్య వాసిరెడ్డి పద్మని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు నగలతో పరారయ్యేందుకు యత్నించారు. ఇది గమనించిన భర్త కృష్ణ దొంగల్ని అడ్డుకోబోయారు. అతనిని కూడా దుండగులు హత్య చేశారు. విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.