బస్సు దిగుతూ కిందపడి వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2021-03-01T05:06:43+05:30 IST
బస్సు దిగుతూ రోడ్డుమీద పడిన వ్యక్తి తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలైన ఘటన శనివారం రాత్రి బల్లిపాడు వద్ద జరిగింది.
తాళ్లపూడి, ఫిబ్రవరి 28 : బస్సు దిగుతూ రోడ్డుమీద పడిన వ్యక్తి తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలైన ఘటన శనివారం రాత్రి బల్లిపాడు వద్ద జరిగింది. ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన మొదలవలస జనార్దనరావు(48) బల్లిపాడు ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడు. జాతర నిమిత్తం శ్రీకాకుళం వెళ్లి వస్తూ రాజమహేంద్రవరంలో బల్లిపాడు బస్సు ఎక్కి గ్రామం చేరుకునే సరికి కంగారుగా బస్సు వెళ్తుండగానే కిందకు దిగాడు. దీంతో రోడ్డుపై పడి తలకు గాయాలై మృతి చెందాడన్నారు. భార్య శ్యామల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవరును అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.