ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
ABN , First Publish Date - 2020-07-05T10:21:24+05:30 IST
పంచాయతీకి కేటాయించిన స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్జైన్ అన్నారు.
శంకర్పల్లి: పంచాయతీకి కేటాయించిన స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్జైన్ అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని పరిధిలోని మోకిలాలో వెంచర్లను, డంపింగ్యార్డు స్థలాలను డీపీవో పద్మజారాణితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంచర్లల్లో పంచాయతీలకు కేటాయించిన 10శాతం స్థలాలను కబ్జా చేస్తే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ న్నారు. మున్సిపాలిటి, పంచాయతీ పరిధిలో ఉన్న వెంచర్లల్లో 10శాతం భూమిని పంచాయతీ పేరిట రిజిస్టేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు.