పవార్పై విమర్శలు.. బీజేపీ నేత చెంప ఛెళ్లు
ABN , First Publish Date - 2022-05-16T08:51:21+05:30 IST
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధి వినాయక్ అంబేడ్కర్పై ఎన్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
ముంబై, మే 15: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధి వినాయక్ అంబేడ్కర్పై ఎన్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వినాయక్ బీజేపీ కార్యాలయంలో కూర్చుని ఉం డగా కొందరు ఎన్సీపీ కార్యకర్తలు లోప లికి ప్రవేశించారు. ఆయనతో వాదనకు దిగారు. వారిలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా వినాయక్ను చెంపదెబ్బ కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధి వినాయక్ అంబేడ్కర్పై ఎన్సీపీ గూండాలు దాడి చేశారు. ఆ గూండాలను తీవ్రంగా శిక్షించాలి’’ అని పాటిల్ తన పోస్టులో వ్యాఖ్యానించారు.