పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు
ABN , First Publish Date - 2020-10-15T07:53:06+05:30 IST
రైతులు పండించిన పంటల ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య,
కందకుర్తి వద్ద సోయా లారీ ప్రారంభం
రెంజల్, అక్టోబరు 14 : రైతులు పండించిన పంటల ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య అన్నారు. బుధవారం రెంజల్ మండలం కందకుర్తి గోదావరి బ్రిడ్జి పైన రైతులు పండించిన సోయాబీన్ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ మార్కెట్కు వెళ్లేందుకు లారీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పండిం చిన సోయాబీన్ను మహారాష్ట్రలో ఇక్కడి ప్రభుత్వ ధర కంటే కూడా మహారాష్ట్రలో ఎక్కువ ఉందని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఇది నిదర్శనమని అన్నారు. రైతు లు నేరుగా తాము పండించినటువంటి పంటలు ఎక్క డైనా అమ్ముకునే వెసులుబాటును బీజేపీ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. రైతుకు పంటను అమ్ముకునే స్వ చ్ఛను తమ ప్రభుత్వం కల్పించిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నాయకులు కోయ సాంబశివరావు, రాజు, స్రవంతిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, నర్సింహారెడ్డి, మేక సంతోష్, లోలపుకిశోర్, యోగేష్, కమలాకర్రెడ్డి తదితరులున్నారు.