వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. విరిగిన చెట్లు..
ABN , First Publish Date - 2021-04-23T06:48:36+05:30 IST
మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయి.
సుల్తానాబాద్, ఏప్రిల్ 22: మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయి. సుల్తానాబాద్, సుద్దాల, రేగడిమ ద్దికుంట, అల్లీపూర్, గట్టేపల్లి, కదంబాపూర్ తదదితర గ్రామాలలో పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్ యార్డులో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం నిలువలు కూడా వర్షం నీటికి కొట్టుకుపోగా, మరికొన్ని కుప్పలు తడిసిముద్దయ్యా యి. ఎలుగు పోచమల్లుకు చెందిన ఒక ఎకరం వరి పం ట పూర్తిగా పడిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి నీట మునిగిపోగా ధాన్యం గింజలన్నీ నేలరాలిపోయాయి. అల్లీపూర్ గ్రామానికి చెందిన ఆవుల శ్రీనివాస్ మొక్కజొ న్న పంట పడిపోయింది. వర్షాలకు గాలులకు కంకులతో ఉన్న పంట దెబ్బతింది. సుల్తానాబాద్ పట్టణంలోని పలు వార్డులలో చెట్లు విరిగిపోయాయి. పలుచోట్ల రోడ్డపై పడ్డా యి. కరెంట్ వైర్లపై కూడా పడిపోవడంతో స్థంబాలు కిం దకు వంగిపోగా, మరికొన్ని చోట్ల విరిగిపోయాయి. గురు వారం ఉదయం మున్సిపాలిటీ వారు పడిపోయిన చెట్ల ను తొలగించారు. విద్యుత్ శాఖ వారు కరెంట్ స్థంభాల స్థానంలో కొత్తవి అమర్చారు. రాత్రి కొన్ని గంటలు సర ఫరా లేకపోగా గురువారం పూర్తి మరమ్మతులు చేశారు. మండల వ్యాప్తంగా దాదాపు 15 కరెంట్ స్థంబాలు విరిగి పోయాయి.